- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించబోదని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్లు జరగకుండా ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లో విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడినా ప్రధాని మౌనంగా ఉన్నారని రాహుల్ మండిపడ్డారు.
- Advertisement -


