- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సెప్టెంబరులో భారత్కు రానున్నట్లు సమాచారం. ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన హాజరు కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2026లో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్.. 18వ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సు ‘బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టెయినబిలిటీ’ అనే అజెండాతో సాగనుంది. 2026 ఆరంభంలో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ నుంచి భారత్ స్వీకరించింది.
- Advertisement -



