బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం.. ఫైళ్ల వనిత రెడ్డి

నవ తెలంగాణ- వలిగొండ రూరల్: బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతాయని ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి ఫైళ్ల శేఖర్ రెడ్డి నీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పైళ్ళ శేఖర్ రెడ్డి సతీమణి పైళ్ళ వనిత అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పులిగిల్ల గ్రామాలలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. గడపగడపకు వెళ్లి ఓటర్లను కలిసి మేనిఫెస్టోలోని అంశాలను వివరించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలనలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా మేనిఫెస్టోలో నిర్ణయించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలో అమలు చేస్తున్న దళిత బంధు, గృహలక్ష్మి, పథకాలు మాకు ఎందుకు ఇవ్వలేదని, సొంత పార్టీ వాళ్లకే సంక్షేమ పథకాలను కట్టబెట్టారని, గ్రామస్తులు పైళ్ళ వనితను నిలదీశారు. ఈ కార్యక్రమంలో మండల బూత్ కమిటి ఇంచార్జిలు, కోమిరెల్లి సంజీవ రెడ్డి, పడమటి మమత నరేందర్ రెడ్డి, డేగల పాండు, నోముల మల్లేష్, స్థానిక సర్పంచి, జక్క వెంకట్ రెడ్డి.ఎంపీటీసీ బండారు ఎల్లయ్య, నాయకులు మహేందర్ రెడ్డి, క్రిష్ణ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love