- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో రేపటి నుంచి భూముల మార్కెట్ విలువలు పెంచుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మీడియాతో ఆయన చిట్చాట్గా మాట్లాడారు. ‘‘భూముల మార్కెట్ విలువలు 50 నుంచి 100 శాతం పెంచుతాం. దీంతో ప్రభుత్వానికి రూ.1,400 కోట్ల ఆదాయం సమకూరుతుంది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఖాజాగూడ వంటి ప్రాంతాల్లో అధిక పెంపు ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే ఆలోచన లేదు. ఫ్యూచర్ సిటీని రద్దు చేసే అవకాశమే ఉండదు. త్వరలో తహసీల్దార్ల బదిలీలు ఉంటాయి’’ అని తెలిపారు.
- Advertisement -



