మందకృష్ణ మాదిగ ఘన స్వాగతం

నవతెలంగాణ-మిడ్జిల్ : ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మాదిగ మందకృష్ణ మాదిగ నిర్వహిస్తున్న విశ్వరూప పాదయాత్రకు మండలంలోని బోయినపల్లి గ్రామానికి వచ్చిన మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీ, బి ఆర్ ఎస్ పార్టీ లంబాడకుల పోరాట సమితి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు . శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. మాదిగల న్యాయమైన డిమాండ్ కోసం పాదయాత్ర చేస్తున్న మందకృష్ణ మాదిగ కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి ,సాయిలు ,మల్లికార్జున రెడ్డి, మిడ్జిల్ ఎంపీటీసీ సభ్యులు మహ్మద్ గౌస్, కృష్ణ యాదవ్, అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు బాలయ్య, దేవయ్య, వెంకటయ్య, కృష్ణయ్య , లంబడి హక్కుల పోరాట సమితి నాయకులు రమేష్ నాయక్, లక్ష్మణ్ పవర్, తిరుపతి నాయక్, వివిధ గ్రామాలకు చెందిన ప్రజాసంఘాల నాయకులు , వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love