కాంగ్రెస్ హయంలోనే అందరికీ సంక్షేమం

– అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు 
– కాంగ్రెస్ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్ రెడ్డి 
నవతెలంగాణ- పెన్ పహాడ్: కాంగ్రెస్ హయంలోనే అందరికీ సంక్షేమం చేకూరుతుందని కాంగ్రెస్ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం, పొట్లపహడ్, మాచారం, దుపహడ్, లింగాల, గాజులమల్కాపురం, తంగెళ్ళగూడెం గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో మహిళలు కోలాటాలాతో భారీ ఎత్తున ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తారో వివరించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. అనంతరం వివిధ పార్టీల నాయకులను పార్టీ జెండాలు కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ఎమ్మెల్యే నవలకుండ్ కొనారెడ్డి, టిపిసీసీ కార్యదర్శి తూముల భుజంగరావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి, వైఎస్ఆర్టిపి అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి, మండల అధ్యక్షుడు తూముల సురేష్ రావు, మాజీ జెడ్పీటీసీ పిన్నని కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీలు మండలి జ్యోతిపిచ్చయ్య, పద్మ శంకర్, నాయకులు అబ్దుల్ రహీం, ఎంపీటీసీ కొండేటి పవన్, నాయకులు పెద్దిరెడ్డి రాజా, నారాయణ ప్రవీణ్ రెడ్డి, మామిడి వెంకన్న, దాచేపల్లి భరత్, కుందూరు వెంకటరెడ్డి, మొండికత్తి లింగయ్య, కమ్మంపాటి రాజు, సన్ని, ఒగ్గు రవి, జుకురి అంజయ్య, జుకురీ గాంధీ, దొంగరి సైదులు, ఆర్తి కేశవులు, దొంగరి జనార్ధన్, పెదపోలు వెంకన్న, బిట్టు కోటయ్య, భూక్య సందీప్ రాథోడ్, భూక్య శివనాయక్, పెదపోలు సునీల్, పిన్నని సందీప్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love