స్థానికుడిని గెలిపించుకోండి.. సమస్యలు పరిష్కరించుకోండి

నవతెలంగాణ- తిరుమలగిరి: స్థానికుడు, ఉద్యమకారుడు తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామేలు హస్తం గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించుకొని నియోజకవర్గ  సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదరబోయిన లింగయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేస్తూ ఈ ప్రాంతంలోని ప్రజలను చైతన్య పరుస్తూ ఆనాడు జె ఏ సి  పిలుపుమేరకు సకలజనుల సమ్మెలోనూ, మిలియన్ మార్చ్ లోను సాగర హారము వంటి కీలకమైన కార్యక్రమాలతో చురుకుగా పాల్గొన్న వ్యక్తి మందుల సామేల్ అన్నారు.2014వ సంవత్సరంలో తెలంగాణ ఏర్పడినప్పుడు ఆనాటి బీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా కమిట్మెంట్ కలిగిన వ్యక్తిగా డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తి మందుల సామేలు అన్నారు. అదేవిధంగా 2018 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఇస్తానని ఇవ్వకపోగా మందుల సామెల్ ని చులకనగా చూస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టడం ద్వారా బీఆర్‌ఎస్‌ పార్టీని వీడిన మందుల ఈ మధ్యకాలంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మందుల సామేలు కి కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బిడ్డగా గుర్తించి తుంగతుర్తి టికెట్ ఇవ్వడం జరిగింది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన మందుల సామేలు మాదిగ కి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీల మద్దతుతో పాటు ఈ ప్రాంత నిరుద్యోగుల మద్దతు పూర్తిగా ఉన్నందున తుంగతుర్తి ప్రజలు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం అన్నారు. అదేవిధంగా ఉద్యమ బిడ్డను గుర్తించి తుంగతుర్తి టిక్కెట్ ఇచ్చి గౌరవించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Spread the love