మూడో పెండ్లికి సిద్దమైన భర్త.. కార్డులు పంచిన భార్యలు

నవతెలంగాణ – హైదరాబాద్: భర్తకు ఇద్దరు భార్యలు కలిసి మూడో పెండ్లి చేశారు. వారే పెళ్లి పెద్దలుగా వ్యవహరించి అక్షింతలు వేశారు. పెదబయలు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని కించూరు గ్రామానికి చెందిన సాగేని పండన్నకు 2000లో పార్వతమ్మతో వివాహం జరిగింది. ఆమెకు సంతానం కలగలేదు. 2005లో అప్పలమ్మను వివాహం చేసుకున్నాడు. 2007లో ఈమెతో ఒక అబ్బాయి పుట్టాడు. తర్వాత పిల్లలు లేరు. ఈ క్రమంలో ఇద్దరు భార్యల అనుమతిలో మరో పెండ్లికి సిద్ధమయ్యాడు. గత నెల 25న జరిగిన మూడో పెండ్లికి భార్యలే పెద్దలుగా వ్యవహరించి, పెండ్లి కార్డులు కొట్టించి, బ్యానర్లు వేయించారు. సంతానం కోసం తన భార్యలు త్యాగం చేశారంటూ పండన్న చెబుతున్నాడు.

Spread the love