తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఇష్టపడి చదువుకోవాలి

– అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మవద్దు
– హుస్నాబాద్ ఎస్ ఐ  తోట మహేష్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగి విద్యార్థులు కష్టపడి ఇష్టంతో చదువుకోవాలని,  మనిషి జీవితాన్ని మార్చేది చదువు ఒక్కటేనని హుస్నాబాద్ ఎస్ ఐ తోట మహేష్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని సెయింట్  జోసెఫ్ హై స్కూల్ లో విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, షీటీమ్ నిర్వహించే విధులు, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ ర్యాగింగ్, ఈవ్ టీజింగ్,  గుడ్ టచ్, బాడ్ టచ్, సైబర్ నేరాల పై హుస్నాబాద్ ఎస్ఐ మహేష్  అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్  మాట్లాడుతూ విద్యార్థులు ఎవరు కూడా బాల్య వివాహాలు చేసుకొని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.  బాల్య వివాహాలు, మానవ అక్రమా రవాణా గురించి సమాచారం ఉంటె మాకు తెలియజేయాలని సూచించారు.  సెల్ ఫోన్స్ అవసరం మేరకు ఉపయోగించాలని, ఎవరు కూడా సైబర్ నేరాలకు గురికావద్దని సూచించారు. తెలియని వ్యక్తులు నుండీ వచ్చే మెసేజ్ లకు రెస్పాండ్ కావద్దని, బ్యాంక్ అధికారులము అంటు ఎవరైన ఫోన్ చేసి అకౌంట్ వివరాలూ అడిగితే చెప్పవద్దని తెలిపారు.విద్యార్థులను ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా షీటీమ్ నెంబర్  8712667434 కాల్ చేయాలని సూచించారు.  మహిళల రక్షణకు ఎల్లప్పుడు షీటీమ్ అండగా ఉంటుందని తెలిపారు. అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని  ఈ వయసులో ప్రేమ పెళ్లి అంటూ చెప్పే వారి మాటలు నమ్మవద్దని సూచించారు. ఇష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్  విజయ్ రెడ్డి, హుస్నాబాద్  షీటీమ్ బృందం సదయ్య , హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుళ్లు  స్వప్న, ప్రశాంతి, కానిస్టేబుళ్లు కృష్ణ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love