బ్లడ్ డొనేషన్  కోసం  యువత పోటీ పడాలి 

– కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
మందు, మటన్, చికెన్ బిర్యానీ తినడానికి పోటీ పడటం కాదని, బ్లడ్ డొనేషన్ చేయడం లో యువత పోటీ పడాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు అన్నారు. ఆదివారం హుస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 24/7 అనే గ్రూపు  యువకులు బ్లడ్ డొనేషన్ క్యాంప్  ఏర్పాటు చేశారు. బ్లడ్ డొనేషన్ చేసిన మండల అధ్యక్షుడు చందు మాట్లాడారు. యువత మందుకు బానిసలు కావద్దన్నారు. బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు బ్లడ్ ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కెడం లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Spread the love