అశ్వారావుపేట ప్రత్యేక అధికారిగా వైటీటీవీ రమణారావు..

– దీర్ఘకాలిక సెలవులో రాజీవ్ కుమార్..
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మేజర్ పంచాయితీ ప్రత్యేక అధికారిగా వైటీటీవీ రమణారావు ను నియమిస్తూ బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు స్థానికి ఈ ఓ గజవెళ్ళి హరిక్రిష్ణ తెలిపిన సమాచారం మేరకు వివరాలు.
ఇప్పటి వరకు ఈ పంచాయితీ ప్రత్యేక అధికారిగా విధుల్లో ఉన్న డిఎల్పీఓ కే.రాజీవ్ కుమార్ అనారోగ్యం కారణం చేత దీర్ఘకాలిక సెలవు కోసం కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నారు. రాజీవ్ కుమార్ సెలవు మంజూరు చేసిన కలెక్టర్ జిల్లా పంచాయితీ రాజ్  పరిపాలనా అధికారి,డీఆర్డీఏ సహాయ విజిలెన్స్ అధికారి గా విధులు నిర్వహిస్తున్న వైటీటీవీ రమణారావు ను ఎఫ్ ఏ సీ డీఎల్పీఓ గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఈయన్నే అశ్వారావుపేట మేజర్ పంచాయితీకి ప్రత్యేక అధికారిగా ను నియమిస్తూ మరో ఉత్తర్వులు ఇచ్చారు.
Spread the love