నేటి విద్యార్థులే రేపటి పౌరులు

-శ్రీనిధి హైస్కూల్‌ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద
నవతెలంగాణ- జగద్గిరిగుట్ట
నేటి విద్యార్థులే రేపటి పౌరులని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. శనివారం సాయంత్రం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రగతినగర్‌ శ్రీనిధి హైస్కూల్‌ 5వ వార్షికోత్సవంలో వేడుకలకు ఎమ్మెల్యే కేపి వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదలతో చదివే విద్యార్థులు భవిష్యత్తులో తప్పక ప్రతిభావంతులవుతారని, దేశానికి దిక్సూచిగా ఉండేలా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ చైర్మన్‌ నల్లపాటి వెంకటేశ్వరరావు, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కస్తూరి బాల్‌రాజ్‌, పాక్స్‌ డైరెక్టర్‌ పరుష శ్రీనివాస్‌ యాదవ్‌, నాయకులు ఆబిద్‌, ఇబ్రహీం, మధు మోహన్‌, శశిధర్‌, సాజిద్‌, శౌకత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Spread the love