- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలోని నలసోపారా వెస్ట్ కలంబ్ ప్రాంతంలోని ఒక ఫార్మ్హౌస్లో దారుణం జరిగింది. కుటుంబంతో కలిసి వచ్చిన 13 నెలల పసికందు ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడు. చుట్టుపక్కల ఎవరూ గమనించకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Advertisement -



