ఘోరం..విమానం కూలి 14 మంది దుర్మరణం

నవతెలంగాణ-హైదరాబాద్ : బ్రెజిల్‌లో శనివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది అంతా దుర్మరణం చెందారు. మొత్తం 14 మంది మరణించినట్టు గవర్నర్ విల్సన్ లీమా సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. అమజోనాస్ రాష్ట్ర రాజధాని మానాస్ నుంచి విమానం బయలుదేరిన విమానం ప్రముఖ పర్యటక కేంద్రం బార్సెలోస్ పరిసరాల్లో కూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. 18 ప్యాసెంజర్లను తరలించగలిగిన ఈ ట్విన్ ఇంజిన్ విమానాన్ని బ్రెజిల్ సంస్థ ఎంబ్రేయర్ తయారు చేసింది.

Spread the love