జి 20 ముగిసింది.. ఇక దేశ సమస్యలపై దృష్టి పెట్టండి : మల్లికార్జున్‌ ఖర్గే

మల్లికార్జున్‌ ఖర్గే
మల్లికార్జున్‌ ఖర్గే( ఫైల్ ఫోటో)

నవతెలంగాణ న్యూఢిల్లీ: ” జి 20 సమావేశాలు ముగిసాయి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం దేశ సమస్యలపై దఅష్టి పెట్టాలి. ఆగస్టులో సాధారణ ప్లేట్‌ ఫుడ్‌ ధర 24 శాతం పెరిగింది నిరుద్యోగం 8 శాతానికి చేరుకుంది. యువత భవిష్యత్తు అంధకారమైంది” అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సోమవారం ట్వీట్ చేశారు. మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ వాస్తవాలను దాచడానికి తీవ్రంగా యత్నిస్తున్నారని, అయితే ప్రజలు నిజాలను తెలుసుకోవాలని కోరుకుంటున్నారని అన్నారు.  కుంభకోణాలు .. మోడీ ప్రభుత్వ దుర్వినియోగం అవినీతికి దారితీసింది. కాగ్‌ అనేక నివేదికల్లో బీజేపీని బట్టబయలు చేసింది.
జమ్మూకశ్మీర్‌లో రూ.13000 కోట్ల జల్‌జీవన్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌లో అవినీతిని బయటపెట్టినందుకు దళిత ఐఎఎస్‌ అధికారిని  వేధించారని  పేర్కొన్నారు. ప్రధాని ప్రాణ స్నేహితుడి దోపిడీ ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చిందన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆర్‌బిఐ ఖజానా నుంచి రూ.3 లక్షల కోట్లను మోడీ ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న ప్రభుత్వ ఒత్తిడిని ఆర్‌బిఐ  మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య వ్యతిరేకించారు.  దీంతో ఈ బండారం బయటపడిందని చెప్పారు.
‘‘మణిపూర్‌లో మళ్లీ హింస జరిగింది. హిమాచల్‌ప్రదేశ్‌లో విపత్తు సంభవించింది. అయితే అహంకారపూరిత మోడీ ప్రభుత్వం దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించకుండా తప్పించుకుంటుంది’’ అని  ఖర్గే ధ్వజమెత్తారు. వీటన్నింటి మధ్య మోడీ వాస్తవాలను కప్పిపుచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ కానీ ప్రజలు వాస్తవాన్ని వినాలని, చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. 2024లో మోడీ ప్రభుత్వ నిష్క్రమణకు ప్రజలు మార్గం సుగమం చేయడం ప్రారంభించారని మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు.

Spread the love