కలిసే పోటీ చేయనున్న విపక్షాలు

ఇండియా కూటమి కీలక నిర్ణయాలు
ఇండియా కూటమి కీలక నిర్ణయాలు

నవతెలంగాణ ముంబయి: లోక్ సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని ఇండియా’(I.N.D.I.A) కూటమిలోని పార్టీలు తీర్మానం చేశాయి. ముంబయిలో 28 పార్టీలకు చెందిన అగ్రనేతల కీలక భేటీలో వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి పోరుకు చేయాల్సిన సన్నద్ధతపై సమాలోచనలు జరుపుతున్నారు. వచ్చే లోక్‌సభ  ఇందులో భాగంగా 14 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. కూటమికి సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే కమిటీగా ఇది వ్యవహరించనుంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కలిసి పోటీ చేయాలని ‘ఇండియా’ కూటమిలోని పార్టీలు తీర్మానించాయి. వివిధ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు ప్రక్రియ తక్షణమే ప్రారంభించనున్నట్టు ఈ మేరకు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. సహకార స్ఫూర్తితో త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలోని ప్రజా సమస్యలపై వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అలాగే, వివిధ భాషల్లో  “జుడేగా భారత్, జీతేగా ఇండియా” అనే థీమ్‌తో ప్రచార వ్యూహాలను సమన్వయం చేసుకొని పనిచేయనున్నట్టు పేర్కొంది. సెప్టెంబర్‌ 30 నాటికి సీట్ల సర్దుబాటు చేసే అంశాన్ని పూర్తి చేసేలా పనిచేయనున్నట్టు సమాచారం.

Spread the love