పిడుగు పాటుకు 20 మేకలు మృతి..

నవతెలంగాణ – పెద్దవూర
పిడుగు పాటుకి 20 గొర్రెలు మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పెద్దవూర మండలం లోని నీమానాయక్ తండా పంచాయతీ పరిధిలోనీ పుల్యా తండాలో  చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రమావత్ శ్రీను నాయక్ 04, రామావత్ సకృ నాయక్ 06,రమావత్ మాతృ నాయక్ 04,రామావత్ భీకోజీ నాయక్ 03,ఊరబాయి తాండకు చెందిన రమావత్ ముని నాయక్ 03  మేకలను మంగళవారం మేపుకొని పూల్య తండా సమీపంలో నీ వరద కాలువలు పక్కన ఏర్పాటు చేసిన కొట్టం లో ఉంచారు. మంగళవారం వారం రాత్రి 10.30 గంటల సమయంలో  ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి గొర్లు ఉన్న కొట్టం లో పిడుగు పడడంతో 20 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. అక్కడ పడుకొని కాపర్లకు ఎలాం టి ప్రాణనష్టం జరగక పోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ప్రభుత్వం ఆదుకో వాలని బాధితుడు కోరుతున్నారు.దాదాపు 2లక్షల విలువ చేసే మేకలు మృతి చెంద డంతో గిరిజన బాధితులు  కన్నీరు మున్నీరయ్యారు.ప్రభుత్వం ఆదుకో వాలని కోరుతున్నారు.
Spread the love