- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండోనేషియాలోని ఒక ప్రావిన్స్లో టోబెలో నగరానికి పశ్చిమంగా 58 కిలోమీటర్ల దూరంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 120 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే, స్థానిక అధికారులు తెలిపారు. సముద్ర గర్భంలో లోతుగా సంభవించిన ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని ఇండోనేషియా వాతావరణ, జియోఫిజిక్స్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ప్రకంపనాలు బలంగా ఉన్నప్పటికీ, ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు ఎటువంటి ప్రాథమిక సమాచారం అందలేదు.
- Advertisement -



