– ఒకే కుటుంబంలో ఇద్దరు
– ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘటన
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదిలాబాద్ రవీంద్రనగర్కు చెందిన శంకర్ బ్యాటరీ షాప్ యజమాని శంకర్(45), ఆయన కుమార్తె కృతిక(20) హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు వస్తున్న క్రమంలో నిర్మల్ రూరల్ మండలం నీలాయిపేట్ వద్ద ఎన్హెచ్ 44 జాతీయ రహదారిపై డీసీఎంను కారు ఢకొీట్టడంతో తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మిత్రునికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అలాగే, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వెంకటేష్, అన్వేష్ ఇద్దరు కారులో నిర్మల్ వెళుతుండగా నేరడిగొండ మండలం రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢకొీట్టడంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందగా ఆయన బావమరిది అన్వేష్ గాయాలతో బయటపడ్డాడు. ఆసిఫాబాద్ మండలంలోని టీనా ఇండిస్టీ వద్ద కారు డివైడర్ను ఢకొీన్న ఘటనలో పోస్ట్ మాస్టర్ అబ్ధుల్లా బిన్ సాలే(42)కు తీవ్ర గాయాలు కాగా, ఆసిఫాబాద్ ప్రభుత్వాస్పత్రి తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
- Advertisement -
- Advertisement -