- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి బైపాస్ వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఓ లారీ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులను చందుపట్ల గ్రామానికి చెందిన జమ్మల లక్ష్మీకాంత్, సంగారెడ్డికి చెందిన వనపర్తి ప్రమోద్గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -


