Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ పంచాయతీల మొదటి లక్ష్యం ప్రజల మౌలిక సదుపాయాలు

గ్రామ పంచాయతీల మొదటి లక్ష్యం ప్రజల మౌలిక సదుపాయాలు

- Advertisement -

నవతెలంగాణ-కాటారం
కాటారం మండలం లోని గంగారం గ్రామ పంచాయతీ ని మంగళవారం రోజున జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ లో జరుగుతున్న పారిశుధ్య పనులను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. కంపోస్ట్ ఎరువు తయారీని పరిశీలించారు.పల్లెప్రగతి పనులను పరిశీలించిన అనంతరం రికార్డులు తనిఖీ చేశారు. పారిశుధ్య పనులు నిరంతరం చేపట్టాలని, గ్రామపంచాయతీ ల మొదటి లక్ష్యం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని  పంచాయతీ కార్యదర్శి బీరెల్లి కర్ణాకర్ ని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -