- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులపై ACB మెరుపు దాడులు చేపట్టింది. అర్ధరాత్రి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలోని కృష్ణా, ఆసిఫాబాద్(D)లోని వాంకిడి, సంగారెడ్డి(D)లోని జహీరాబాద్, కామారెడ్డి(D)లోని కామారెడ్డి, మద్నూరు, భద్రాద్రి(D)లోని అశ్వారావుపేట చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టి పలువురిని ప్రశ్నించింది. రవాణాశాఖ చెక్పోస్టులపై ACB ఏకకాలంలో దాడులు చేపట్టడం ఇది రెండోసారి.
- Advertisement -