నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం చోటుచేసుకుంది. రోహిణి ప్రాంతంలో గ్యాంగ్స్టర్లు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బిహర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో బిహార్కు చెందిన నలుగురు బడా గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. మృతుల్లో గ్యాంగ్లీడర్ రంజక్ పాఠక్ (25), బిమ్లేష్ మహతో అలియాస్ బిమ్లేష్ సాహ్ని (25), మనీష్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21) ఉన్నారు. ఈ ఎన్కౌంటర్కు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, బిహార్లో అనేక తీవ్రమైన నేరాల్లో మోస్ట్ వాంటెడ్గా ఈ నలుగురు నిందితులు ‘సిగ్మా ఎండ్ కంపెనీ’ పేరుతో ఓ గ్యాంగ్ను నడిపుతూ అరాచకాలు సృష్టించారు.
భారీ ఎన్కౌంటర్.. నలుగురు గ్యాంగ్స్టర్లు హతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES