- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూర్మారపు వరలక్ష్మి తన ఇద్దరు చిన్నారుల పీక కోసి చంపేసింది. అనంతరం ఆమె కూడా పీక కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వరలక్ష్మిని 108లో శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



