- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఐ డి ఓ సి ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని శనివారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం రాష్ట్రవ్యాప్తంగా రూ. 5.80 కోట్లు నిధులు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్ అండ్ బి ఈ ఈ మోహన్ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి, పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఈ, సిబ్బంది, సంబంధిత శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



