Thursday, October 30, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్SFI విద్యాసంస్థల బంద్ జయప్రదం

SFI విద్యాసంస్థల బంద్ జయప్రదం

- Advertisement -

– ఫీజులు అడిగితే విద్యాసంస్థలలో విజిలెన్స్ దాడులు సిగ్గుమాలిన చర్య

– రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీనైనా అమలు చేయాలి

– 14 లక్షల మంది పేద విద్యార్థుల గోస ప్రభుత్వానికి వినపడదా ?

– రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రులను అడుగడుగునా అడ్డుకుంటాం.

– సర్టీఫికెట్స్ ఇచ్చేందుకు ఫీజులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి

– రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాలలు, యూనివర్శీటీలు బంద్ జయప్రదం

– హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలో పోలీసులు అరెస్టులు, ఖండించిన రాష్ట్ర కమిటీ

– నారయణ గూడ నుండి వైఎంసిఎ వరకు భారీ ర్యాలీ

– ఫీజులను విడుదల చేసేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు సంక్షేమం విస్మరించిందని, 23 నెలలుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు పెండింగ్ ఫీజు బకాయిలు మరియు స్కాలర్ షిప్స్ కోసం రోడ్డెక్కారు. అయినా ప్రభుత్వం సమస్య పరిష్కారం చేయకుండా ఇంకా జఠిలం చేస్తుందని తక్షణమే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విద్యాసంస్థల బంద్ జయప్రదం అయ్యింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో బంద్ సందర్భంగా నారయణ గూడ నుండి వైఎంసిఎ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజులు మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఫీజులు కోసం విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని వచ్చిందని గత ప్రభుత్వం బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పి అవి చెల్లించక పోగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన 4600 కోట్లు బకాయిలు కూడా విడుదల చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ చేసిన సందర్భంగా ప్రభుత్వం చర్చలు జరిపి 1200 కోట్లు ఇస్తామని ప్రకటించిందని ప్రకటించిన విధంగా దసరాకు 300 కోట్లు, దీపావళికి 900 కోట్లు నవంబర్ మరో 300 కోట్లు ఇస్తామని చెప్పి చెల్లించకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు పడెలా చేస్తుందని అన్నారు.

రాష్ట్రంలో ఫీజులను చెల్లించమని అడుగుతుంటే విజిలెన్స్ దాడులు పేర విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. విజిలెన్స్ దాడులు పేరుతో విద్యాసంస్థలే ఫీజు రీయంబర్స్ పథకం వద్దనేలాగా చేసి, ఈ పథకాన్ని ఏత్తివేసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం ఫీజులను చెల్లించి సమస్యను పరిష్కరించాలని లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అడుగడుగునా అడ్డుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఇచ్చిన బంద్ జయప్రదం అయ్యిందని తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్, కె.అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనకు మేం కట్టుబడి ఉన్నామంటున్న రేవంత్ రెడ్డి నిర్బంధం ప్రయోగించి బంద్ అణాచాలనే ప్రయత్నం చేయడం దుర్మార్గపు చర్య అని తక్షణమే హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలో అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని అన్నారు. రాష్ట్రంలో విద్యరంగంలో అడుగడుగునా సమస్యలు ఉన్నాయని పెండింగ్ ఫీజులనువిడుదల చేయకపోవడం, బెస్ట్ బకాయిలు విడుదల చేయకపోవడం అనేక సమస్యలు ఉన్నాయని రాష్ట్ర విద్యారంగం నిద్రావస్థలో ఉందన్నారు. ఫీజులను విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బలమైన ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు.

హైదరాబాద్ నగరంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లెనిన్ గువేరాను బస్సులు అడ్డుకుంటుండుగా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఉస్మానియాలో బంద్ చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేశారు. కరీంనగర్, మహాబుబ్ నగర్ లో పోలీసులు నిర్బంధం ప్రయోగించారు. ఈ అక్రమ నిర్బంధాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ భారీ ప్రదర్శనలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జె.రమేష్, హైదరాబాద్ జిల్లా నాయకులు స్టాలిన్, నాగేందర్, మనోజ్, ఆంజనేయులు, శివ గణేష్ ,కార్తీక్,శ్రీకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -