Wednesday, November 5, 2025
E-PAPER
Homeజిల్లాలుహోటల్ భోజనంలో ఈగ

హోటల్ భోజనంలో ఈగ

- Advertisement -

నవతెలంగాణ-జోగులాంబ గద్వాల్‌: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోనీ కొత్త హౌసింగ్ బోర్డ్ సమీపంలో కలెక్టరేట్ ఎదురుగా ఉన్న‌ ఓ హోటల్‌ యజమాని కలుషిత భోజనం పెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా అందులో ఈగ ప‌డి ఉంది. ఈ వ్య‌వ‌హారం హోటల్ యజమాని దృష్టికి తీసుకెళ్లగా.. ఈగని పక్కకు పెట్టి భోజ‌నం చేయ‌మ‌ని క‌స్ట‌ర్‌తో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు హోటల్ యాజమాని. హోటల్ యజమానిపై సంబంధింత అధికారులు తగుచర్య తీసుకోవాలనిబాధితుడు డిమాండ్ చేశాడు. జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్టర్ కల్తీ ఆహారం విక్రయిస్తున్న హోటల్ యజమానులపై చర్యలు తీసుకోవాల‌న్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -