ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.
ఇటీవల హీరో ప్రభాస్ రిలీజ్ చేసిన ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ, ‘మేం సినిమా మీద బజ్ను క్రియేట్ చేసే క్రమంలోనే ట్రైలర్ను ఇంత త్వరగా రిలీజ్ చేశాం. ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ అందరూ కూడా మా ట్రైలర్ను మెచ్చుకుంటున్నారు. మాకు సహకరించిన వంశీ, ప్రమోద్, ప్రసాద్లకు థ్యాంక్స్. ట్రైలర్ చూసి కిరణ్ అబ్బవరం అభినందించారు. రానా మెచ్చుకున్నారు. ఈ మూవీకి తనవంతు సాయం చేస్తానని రానా మాటిచ్చారు. హిందీ రిలీజ్ గురించి కూడా అందరూ అడుగుతున్నారు. మా నిర్మాతలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంతో వారికి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. యుగంధర్ ఈ మూవీని అద్భుతంగా రూపొందించారు. డిసెంబర్ 25న మా చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నాం. మా చిత్రం కచ్చితంగా ఏ ఒక్కరినీ నిరాశపర్చదు’ అని అన్నారు.
‘ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. టెక్నికల్గా ఎంతో గొప్ప స్థాయిలో ఉంటుంది. ట్విస్ట్, టర్న్స్ ఇలా అన్నీ అద్భుతంగా ఉంటాయి’ అని దర్శకుడు యుగంధర్ ముని చెప్పారు. హీరోయిన్ అర్చనా అయ్యర్, నటులు రవి వర్మ, ఇంద్రనీల్, మధు నందన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విశేషాలను షేర్ చేశారు.
‘శంబాల’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -



