నవతెలంగాణ-సారంగాపూర్
మండలంలోని సుప్రసిద్ధ మహా పుణ్యక్షేత్రం అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయ పునః ప్రతిష్టాపన వేడుకలు కొనసాగుతున్నాయి.బుధవారం మూడవరోజు ఉదయం వేదపండితులు చంద్రశేఖర్ శర్మ ఆద్వర్యంలో మంగళ వాయిద్యాల మధ్య వేదపండితుల మంత్రోత్సవాలతో నిత్యవిధి,చండీపారాయణ,సహస్రకలిశస్థాపన,చండీ హోమం,విగ్రహాల ఫల పుష్పాదివాసము చేసారు.ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి ల ఆద్వర్యంలో మహా అన్నదాన వితరణ చేసారు.వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ స్వరంలోఅన్ని ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రంలో సొసైటీ చైర్మన్ ఐర నాయనారెడ్డి,మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి,మాజీజడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి,దశరథ రాజేశ్వర్, మాధవ్ రావు, ఉట్ల రాజేశ్వర్,భోల్లోజి నర్సయ్య,ఓ నారాయణ రెడ్డి,రాజేశ్వర్ రావు, మారుతి, మాల ధారణ స్వాములు,భక్త జనులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు
- Advertisement -
- Advertisement -



