Saturday, November 8, 2025
E-PAPER
Homeజిల్లాలుఎంతటి నియంతలైనా గద్దె దిగాల్సిందే..

ఎంతటి నియంతలైనా గద్దె దిగాల్సిందే..

- Advertisement -
  • ప్రపంచం పరిణామల స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి..
  • సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. వీరయ్య.
  • రామన్నపేటలో ఉత్సహపూరితంగా సీఐటీయు జిల్లా మహాసభలు
  • నవతెలంగాణ – రామన్నపేట
    కార్మిక వర్గం సంఘాటితంగా తిరగబడితే ఎంతటి నియంతలైన గద్దె దిగాల్సిందేనని, ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామలను చుస్తే అర్ధం అవుతుందని సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య అన్నారు. మండల కేంద్రంలో స్థానిక మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో శనివారం సీఐటీయు జిల్లా 4వ మహాసభలు ఉత్సహపూరితంగా నిర్వహించారు. జిల్లాలోని 17 మండలాల వివిధ రంగాల నుండి 300 మంది కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు. పారంభసూచికంగా అరుణపాతాకాన్ని జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు ఆవిష్కరించాగా.. నాయకత్వం, ప్రతినిధులు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిధిగా హాజరైన ఎస్. వీరయ్య మాట్లాడుతూ.. ప్రపంచాన్ని ఆయుధం సంపత్తితో శాసిస్తున్న అమెరికాలో న్యూయర్క్ నగరంలో కార్మికుల పక్షపాతి, జోహ్రన్ మాందనీ విజయం, ఇటీవల శ్రీలంకలో జరిగిన ఎన్నికల్లో దిస నాయకే విజయం పెట్టుబడి దారులకు చెంపపెట్టు అని అన్నారు.

  • దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోందని అన్నారు. దేశాన్ని ఆదాని-అంబానిలకు తాకట్టు పెట్టిందని ఆయన ఆరోపించారు. న్యూయార్క్, శ్రీలంక స్ఫూర్తితో కార్మిక వర్గం మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలను ఆయన పిలుపునిచ్చారు. సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన పనిగంటల పని విధానాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచ్చేస్తుందని, బీజేపీ కి కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మికుల విషయంలో తేడాలేదని ఆయన విమర్శించారు.

  • అనంతరం జిల్లా మహాసభలో జిల్లా వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాట కార్యాచారణకు పలు తీర్మానాలు చేశారు. ఈ మహాసభలో సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం, జిల్లా నాయకులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గొరిగే సోములు, ఎండీ. పాషా, చిలువేరు రమా కుమారి, దోనూరి నర్సిరెడ్డి, తుర్కపల్లి సురేందర్, బొడ్డుపల్లి వెంకటేశం, సుబ్బురు సత్యనారాయణ, పైళ్ళ గణపతి రెడ్డి, మాయ కృష్ణ, నకిరేకంటి రాము, ఆడిమూలం నందిశ్వర్, స్వప్న, కోట సంధ్యా రాణి, బందెల బిక్షం, అప్పం సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -