- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం వారు నిర్మించిన వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రావలసిందిగా ఆదివారం ఆదర్శనగర్ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులకు ఆహ్వాన పత్రికను అందజేసినారు. ఈనెల 11వ తేదీ మంగళవారం నుండి కార్యక్రమాలు ప్రారంభమై గురువారం అన్నదాన కార్యక్రమం సైతం నిర్వహించడం జరుగుతుందని సంఘ సభ్యులు గోవర్ధన్ ,మోహన్, చంద్రయ్యలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదర్శనగర్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీరామ్ వేణు ,కార్యదర్శి గంగాధర్, ముఖ్య సలహాదారు మాలెపు అరుణ్ ,చామంతి నవీన్, పోలాస రవి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



