Friday, May 16, 2025
Homeరాష్ట్రీయంచిన్నారి వేదవల్లి కుటుంబానికి సీఎం ఆర్థిక చేయూత

చిన్నారి వేదవల్లి కుటుంబానికి సీఎం ఆర్థిక చేయూత

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అల్లారుముద్దుగా పెంచుకున్న పాప ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రికి తీసుకెళితే బ్లడ్‌ క్యాన్సర్‌ అని పరీక్షల్లో తేలింది. పాపను రక్షించుకునేందుకు తల్లిదం డ్రులు రూ.లక్షలు వెచ్చించారు. ఈ విషయం ముఖ్య మంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి దృష్టికి రావడంతో పాప చికిత్సకు రూ.8 లక్షలు మంజూరు చేశారు. వ్యాధి ముదరడంతో పాప ప్రాణాలు కోల్పోయింది. ఆమె చికిత్సకు గతంలో చేసిన వ్యయానికి సంబంధించి మరో రూ.7 లక్షలను సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి విడుదల చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించడంతో అధికారులు ఆ మొత్తాన్ని విడుదల చేశారు. హైదరా బాద్‌ ఎల్బీనగర్‌కు చెందిన రఘు, మంజుల దంపతులు. రఘు ప్రయివేటు కంపెనీలో ఉద్యోగి. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె వేదవల్లికి (5) 2022లో తీవ్ర జ్వరం రావడంతో పరీక్షించిన వైద్యులు ఆమెకు బ్లడ్‌ క్యాన్సర్‌ (అనాప్లాస్టిక్‌ లార్జ్‌ సెల్‌ లార్జ్‌ లింఫోమా) అని తేల్చారు. పాపను రక్షించుకునేందుకు రెండేళ్ల పాటు తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. చికిత్స వ్యయం నానాటికీ భారమవడంతో 2024లో సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి స్పందించి, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో వేదవల్లి చికిత్సకు అవసరమైన రూ.8 లక్షలను మంజూరు చేశారు. చికిత్స అందిం చినప్పటికీ అప్పటికే వ్యాధి తీవ్రత పెరగడంతో గతేడాది చివరలో వేదవల్లి మరణించింది. ఆమె చికిత్సకు గతంలో ఆ కుటుంబం పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. దీంతో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకు నేందుకు రూ.7 లక్షలు మంజూరు చేయాలని ముఖ్య మంత్రి అధికా రులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు మంజూరు చేసిన రూ.7 లక్షల చెక్కును సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు వేదవల్లి తండ్రి రఘుకు గురువారం సచివాలయంలో అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -