Saturday, November 15, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో మెరుగుప‌డ‌ని గాలి నాణ్య‌త‌

ఢిల్లీలో మెరుగుప‌డ‌ని గాలి నాణ్య‌త‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు పడిపోయాయి. శనివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలో 386 వద్ద ఎక్యూఐ నమోదైంది. దీంతో ఈ స్థాయిల్ని ‘వెరీ పూర్‌’ కేటగిరీలో వర్గీకరించినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలోనే గాలి నాణ్యతలు నమోదయ్యాయి.

అశోక్‌ విహార్‌లో 415, బవానా 441, బౌరారి 383, సిఆర్‌ఆర్‌ఐ మథుర రోడ్‌ 365, చాందినీ చౌక్‌ 419, ద్వారకా సెక్టార్‌ 393, ఐటిఓ 418, జహంగిరిపురి 422, జెఎల్‌ఎన్‌ స్టేడియం 389, ముండ్కా 426, నజాఫ్‌గర్‌ 385, నరేలా 418, పట్పార్‌గంజ్‌ 399, పంజాబి బాగ్‌ 405, ఆర్‌కె పురం 406, రోహిణీ 424, సిరి కోట 495, సోనియా విహార్‌ 410, వివేక్‌ విహార్‌ 418, వజీర్‌పూర్‌ 447గా ఎక్యూఐ నమోదైంది.

కొన్ని ప్రాంతాల్లో వెరీ పూర్‌ కేటగిరీలో.. మరికొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరస్థాయిలో ఎక్యూఐ నమోదైంది. ఇప్పటికే కాలుష్య నియంత్రణకు గ్రాప్‌ 2, గ్రాప్‌ -3 నిబంధనలు అమల్లో ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -