- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: సౌదీ అరేబియా లో జరిగిన ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్ కు చెందిన ఉమ్రా యాత్రికుల మృతి పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నారని సమాచారం తెలుసుకొని సౌదీ అరేబియా లో ఉన్న ఎన్నారై కాంగ్రెస్ నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మృతులకు ప్రగడ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు డిప్యూటీ సీఎం సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.
- Advertisement -



