Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోట

ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
భారత మాజీ మహిళా ప్రధాని, భారతరత్న, స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పారని అన్నారు. ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని శక్తిమంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడారు. ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలు నేటితరం నాయకులకు, యువతకు సైతం స్ఫూర్తిదాయకమని తెలిపారు. బ్యాంకుల జాతీయకరణ, జమీందారీ వ్యవస్థ రద్దు, గరీబీ హఠావో వంటి దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు.

ఇందిరా గాంధీ భారత స్త్రీ శక్తికి ప్రతీక అని, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తినిచ్చే నాయకురాలిగా  ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని వెల్లడించారు. అవకాశాలు వస్తే అద్భుతాలు చేయగలం అంటూ నిరూపించారని..ప్రతి మహిళకు ఆమె చూపిన ధైర్యం, అంకితభావం నేటికీ స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ జుక్కల్ ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -