- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కామారెడ్డి శివారులో ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనడంతో 90కి పైగా గొర్రెలు మృతి చెందాయి. దేవునిపల్లికి చెందిన సుధాకర్ మరో వ్యక్తితో కలిసి ఫైర్ స్టేషన్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద గొర్రెలు మేపుతుండగా ఈ ఘటన జరిగింది. రైలు వేగంగా రావడంతో మంద మొత్తం పట్టాలపై చిక్కుకుంది. భయంతో సుధాకర్ పక్కనున్న వాగులోకి దూకగా, ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యాడు. గాలింపు తర్వాత అతడి మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



