Tuesday, November 25, 2025
E-PAPER
Homeకరీంనగర్ఒక్కసారిగా కుంగిన బేస్‌మెంట్‌.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు తప్పిన ప్రమాదం

ఒక్కసారిగా కుంగిన బేస్‌మెంట్‌.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు తప్పిన ప్రమాదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కాంగ్రెస్‌ నేతలు, అధికారులతో కలిసి వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లును మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు. ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్ గరీమ అగర్వాల్‌, పార్టీ నేతలతో కలిసి గృహ సముదాయం వద్ద బేస్‌మెంట్‌పై నిల్చొని పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అది కుంగింది. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్‌ నేతలు.. ఆది శ్రీనివాస్‌ కింద పడిపోకుండా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -