– 36 మంది మృతి
– 300 మంది మిస్సింగ్
థాయ్ పొ: హాంకాంగ్లోని ఓ నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. థాయ్ పొ జిల్లాలోని ఆకాశహర్మ్యాల్లో బుధవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 36 మంది చనిపోగా, 279 మంది కనిపించకుండా పోయారు. ఆ నివాస సముదాయంలో 2000 ఇండ్లు ఉన్నాయని, అందులో కొన్ని ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మొత్తం 7 అపార్ట్మెంట్లలో 4,800 మంది ప్రజలు నివసిస్తున్నారు. అగ్నిప్రమాదంతో 700 మందిని తాత్కాలిక నివాసాలకు తరలించారు. హాంకాంగ్ స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.51 గంటల సమయంలో ఈ ఘటనపై సమాచారం అందిందని అగ్నిమాపక విభాగం వెల్లడించింది. ఈ ప్రమాదాన్ని నం.5 అలారంగా అధికారులు ప్రకటించారు. ఈ అత్యయిక పరిస్థితి ప్రకటించినప్పుడు భారీ స్థాయిలో ఫైర్ ఇంజిన్లు, సిబ్బందిని మోహరించాల్సి ఉంటుంది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. భవనాలు దగ్గరదగ్గరగా ఉండడంతో మంటలు ఇతర భవనాలకు వేగంగా వ్యాపించాయి. ఘటన మధ్యాహ్నం జరిగినప్పటికీ రాత్రి వరకు ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. 128 ఫైరింజన్లతో సహాయ చర్యలు చేపట్టగా, 57 అంబులెన్స్లు ఘటనాస్థలంలో మోహరించారు. ఈ ప్రమాదంలో ఫైర్ సిబ్బంది ఒకరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.
హాంకాంగ్లో భారీ అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



