- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీసత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తలుపుల మండలం గరికపల్లెలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు హర్షవర్ధన్ హత్యకు గురయ్యాడు. నవంబర్ 26న సాయంత్రం ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. బావపై కోపంతో మామ ప్రసాద్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. గౌకనపేట అటవీ ప్రాంతంలో హర్షవర్ధన్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు నిందితుడు ప్రసాద్ను అరెస్టు చేశారు.
- Advertisement -



