Sunday, April 5, 2026
E-PAPER
Homeకరీంనగర్ఆదివారంపేటలో క్షుద్ర పూజల కలకలం

ఆదివారంపేటలో క్షుద్ర పూజల కలకలం

- Advertisement -

నవతెలంగాణ-రామగిరి

రామగిరి మండలంలోని ఆదివారంపేట గ్రామంలోని బుద్దార్తి రాజాలింగు ఇంటిముందు గురువారం రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. ఇదే ఇంటి ముందు ఇప్పటికే మూడుసార్లు జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఈ క్షుద్ర పూజలలో విస్తార్లో నిమ్మకాయలు, బియ్యం, పసుపు, కుంకుమ ఇతరత్రా క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులు పెట్టారు. నేటి ఆధునిక కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు గ్రామాలలో జరుగుతున్నాయి. వీటికి సంబంధించి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి, ఇలా చేసే వారిని అదుపులోకి తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -