– అభివృద్ధి సంక్షేమ పథకాల్లో వారికే పెద్దపీట
– కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసి తీరుతాం : వీ హబ్ విమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
”ఆర్థిక క్రమశిక్షణ మా ఆడబిడ్డల సొంతం. సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో వారికే పెద్దపీట వేస్తున్నాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసి తీరుతాం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది” అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో వీ హబ్ విమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని అన్నారు. ఆ దిశగా ప్రభుత్వం అన్ని రంగాల్లో వారికి ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు చేపట్టిందని తెలిపారు. ”మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఫలితంగా ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ఆడబిడ్డలకు అప్పగించాం. విద్యార్థుల యూనిఫాంల కుట్టుపనిని మహిళా సంఘాలకు అప్పగించి వారికి భరోసా అందించాం. వ్యాపారంలో మహిళలను ప్రోత్సహిస్తున్నాం పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాలు చేసేందుకు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం అదానీ, అంబానీలకు పరిమితమైన వ్యాపారాలను మహిళలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. శిల్పారామంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనకు స్టాళ్లను కేటాయించాం” అని సీఎం అన్నారు. ఇప్పటికే వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని మహిళలకు అప్పగించామనీ, వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తే మరో వెయ్యి మెగావాట్ల వ్యాపారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేసిన వాటినే రాష్ట్రానికి వచ్చే అతిథులకు బహుమ తులుగా అందిస్తున్నామని చెప్పారు. ఆడబిడ్డలను ప్రోత్సహించడమే ప్రభుత్వ విధానమని గుర్తు చేశారు. రూ.16 లక్షల కోట్లను కార్పొరేట్ కంపెనీలకు అప్పు ఇస్తే ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లారనీ, కానీ ఆడబిడ్డలకు అప్పు ఇస్తే.. ఒక్క రూపాయి ఎగ్గొట్టకుండా వడ్డీతో సహా చెల్లిస్తున్నారని కొనియా డారు. అదే స్ఫూర్తితో మహిళా సంఘాలు ముందు కెళ్లాలని ఆకాంక్షించారు. చైనా, పాకిస్తాన్లతో యుద్ధం జరిగినపుడు ఇందిరాగాంధీ మహిళా శక్తిని ప్రపంచా నికి చాటారని గుర్తు చేశారు. దేశాన్ని గెలిపించిన మహిళా శక్తిని కాంగ్రెస్ ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదని అన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం వారిని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలబెట్టేందుకు కృషి చేస్తోందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
ఆడబిడ్డలతోనే ఆర్థిక క్రమశిక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES