- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గుల్జార్హౌస్లో అగ్నిప్రమాద ఘటనపై లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో పలువురు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే సీఎం రేవంత్రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారు. గుల్జార్హౌస్ అగ్నిప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును సీఎం ఆయనకు వివరించారు.
- Advertisement -