నవతెలంగాణ – న్యూఢిల్లీ : ఫైబర్నెట్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ ను కోరుతూ.. టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పి పై సుప్రీం కోర్టులో శుక్రవారం కొనసాగిన విచారణ మళ్లీ నవంబర్ 8వ తేదీకి వాయిదాపడింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపించారు. వాదనల అనంతరం తదుపరి విచారణను సుప్రీం కోర్టు నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసుపై తీర్పు తర్వాత ఫైబర్ నెట్ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని, అప్పటి వరకు పీటీ వారెంట్పై యథాతథ స్థితి కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.