- Advertisement -
పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి పట్టణం 2వ వార్డుకు చెందిన కమ్మరి వంశీ చారి శుక్రవారం రాత్రి కరెంట్ షాక్ తో మృతి చెందారు. వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ ద్వారా విషయం తెలుసుకున్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శనివారం వనపర్తి జిల్లా ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులను పరామర్శించి, మార్చూరులోని మృతదేహాన్ని చూస్తూ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రంజిత్, హరీష్, రాఖి, వెంకీ తదితరులు ఉన్నారు.
- Advertisement -



