- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన ఉషా సంతోష్ మేస్త్రి దంపతులకు మండల కేంద్రంలోని ప్రయివేట్ పాఠశాలల యజమాన్యాలు కలిసి శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. మండల కేంద్రంలోని అభ్యుదయ, సాక్షర, వాసవి, న్యూ ఆదర్శ్, కార్మెల్, పాఠశాలలకు చెందిన యజమాన్యాలు విట్టల్, సందీప్, మనోజ్, నాందేవ్, శశికాంత్, ఈ ఐదుగురు కలిసి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఘనంగా సన్మానించిన ప్రయివేట్ పాఠశాలల యజమానులకు సర్పంచ్ దంపతులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. యజమానియాలతో పాటు పలువురు యువకులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
- Advertisement -



