నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) యాక్టింగ్ ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఢాకా-17, బోగ్రా-6 రెండు నియోజకవర్గాల నుంచి ఆయన బరిలో దిగుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. బోగ్రా-16 నియోజకవర్గానికి గతంలో తారిఖ్ రెహ్మాన్ తల్లి, మాజీ ప్రధాని ఖలీదా జియా ప్రాతినిధ్యం వహించారు. ఒకప్పుడు ఈ స్థానం బీఎన్పీకి కంచుకోటగా ఉండేది. అయితే, 2023లో జరిగిన ఉప ఎన్నికల్లో అవామీ లీగ్ నాయకుడు ఆషన్ రిపు ఇక్కడ విజయం సాధించారు. అయితే నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుండటంతో తారిఖ్ రెహ్మాన్ తరఫున బీఎన్పీ నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. సుమారు 17 ఏళ్ల తర్వాత తారిఖ్ రెహ్మాన్ బంగ్లాదేశ్కు తిరిగి వచ్చారు. ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఓటరు జాబితాలో ఆయన పేరును చేర్చేందుకు ఎన్నికల సంఘం అంగీకరించింది.
బంగ్లాదేశ్ ఎన్నికలు..తారిఖ్ రెహ్మాన్ రెండు చోట్ల పోటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


