నవతెలంగాణ – ఆలేరు రూరల్
గోలనుకొండ సర్పంచ్ ఉప సర్పంచులుగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం నాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏ జి పి హరిబాబు మాట్లాడుతూ.. సర్పంచ్ గా ఇందూరి యాదిరెడ్డి ఉప సర్పంచ్ గా యాదగిరి గెలుపొందిన వార్డ్ మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రతినిధులుగా గొలనుకొండ గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా ఆలయ నియోజకవర్గంలో నిలబెట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులతో పాటు పుట్టిన ఊరుకు సేవ చేయడం చాలా అదృష్టం ఉండాలన్నారు.ప్రజలు ఎన్నో ఆశలతో మిమ్మల్ని గెలిపించాలని వారి ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి పథంలో గ్రామపంచాయతీ పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాకీ లక్ష్మి,మాజీ ఎంపీటీసీ రాం మల్లయ్య, మద్దెబోయిన రాములు, ముగ్గు పెద్ద సమ్మయ్య, ముగ్గు సారయ్య,ముగ్గు వంశీ,ముగ్గు చిన్న సమ్మయ్య, ముగ్గు యాదగిరి, బాకీ అశోక్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సాగర్,వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
గొలనుకొండ సర్పంచుకు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



