- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
నవతెలంగాణ నిరంతరం జన స్వరం,ప్రజలు పక్షాన వినిపించే నికార్సైన గొంతుక అని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. 2026 నవతెలంగాణ కేలండర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. నాడు ప్రజాశక్తి గా ఉన్న ఈ పత్రిక ప్రజా పోరాటాలకు దిక్చూచి అయిందని,అదే ఒరవడి నవతెలంగాణ కొనసాగించడం హర్షణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ ప్రతినిధి మడిపల్లి వెంకటేశ్వరరావు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు.
- Advertisement -



