- Advertisement -
– ప్రత్యేక అధికారిని గంగామణి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2026 27 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు విద్యాలయం ప్రత్యేక అధికారిని గంగామణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరవ తరగతిలో ఐదు ఖాళీలు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. విద్యాలయంలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థినిలు బోనఫైడ్, ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో పాఠశాలకు హాజరై అడ్మిషన్లు పొందాలని సూచించారు. ఆసక్తి ఉన్న విద్యార్థినిలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గంగామణి కోరారు.
- Advertisement -



