ఎన్నికలు రాగనే బీఆర్ఎస్ కి కొత్త పథకాలు గుర్తుకొస్తాయి

-10 ఏళ్ల పాలనలో కేసిఆర్
అసంపూర్తి హామీలే
– ఎంపీ హత్యాయత్నానికి మాకేం సంబంధం లేదు
– బీఆర్ఎస్ ఆరోపణలు మానుకోవాలి 
– మరోసారి ఓటేసి గెలిపించాలని అభ్యర్థన 
– దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు 
నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : ఎన్నికల ముందే బీఅర్ ఎస్ కి  అమలుకాని పథకాలు యాదికోస్తాయని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ కి ఓటేసి గెలిపిస్తే కారు పార్టీ గ్యారేజికి పంపడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రఘోత్తంపల్లి, ఆకారం, గోసాన్ పల్లి గ్రామాల్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారికి బీజేపీ నాయకులు డప్పు చప్పుళ్ళుతో  ఘనంగా స్వాగతం పలికారు. దుబ్బాక ను మరింత అభివృద్ధి చేస్తా వచ్చే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై మీ అమూల్యమైన ఓటేసి మరోసారి గెలిపించాలని అభ్యర్తించారు. 2020 ఉప ఎన్నికల్లో దుబ్బాక పేరు రాష్ట్రం మొత్తం మారు మోగిందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు తప్పుడు ప్రచారాలు చేస్తున్న సీఎం కేసీఆర్ ని వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపాలని  సూచించారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో దళితులకు దళిత బంధు ఇవ్వకగా పోగా ఈ సారి ఎన్నికల్లో గెలిచేందుకు బీసీ బంధు, మైనార్టీ బంధు లాంటి పథకాలను ప్రవేశపెట్టి గ్రామానికి  ఒకరిద్దరికే  ఇచ్చ చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.తాను గెలిచాక బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచి దుబ్బాక లో నూతన బస్టాండ్, పెండింగ్ లో ఉన్న వంద పడకల ఆసుపత్రితోపాటు అనేక అభివృద్ధి  పనులుజరిగాయన్నారు. చదువుకున్న యువతకు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చిన మాటలు నేటికీ అమలు కాలేదన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.1600 కోట్లుతో ఎల్కతుర్తి నుంచి మెదక్ వరకు నేషనల్ హైవే తీసుకొచ్చానని,ఓటేస్తే సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల తరహా దుబ్బాక అభివృద్దికి చేస్తానని పేర్కొన్నారు.ఇటీవల మెదక్ ఎంపీ పై జరిగిన హత్యాయత్నం జరిగితే తమపై  బీఆర్ఎస్  అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి అంబటి బాలేశ్ గౌడ్, బిజెపి మండల అధ్యక్షుడు అంబటి శివప్రసాద్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కృష్ణమ్మ గారి సుభాష్ రెడ్డి,పార్టీ  ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Spread the love